Logo
Date of Publish : 16 May 2021, 2:05 pm
Editor : Sake Naresh

కోవిడ్‌తో చ‌నిపోతే ద‌హ‌న సంస్కారాల‌కు రూ.15 వేలు

 

జీవో.347 విడుద‌ల చేసిన స‌ర్కార్‌

అమ‌రావ‌తి,(ADITYA9NEWS): ఎవ‌రైనా కోవిడ్‌తో చ‌నిపోతే ద‌హ‌న సంస్కారాల‌కు ఇక‌పై వారి బంధువులుగాని, కుటుంబ‌స‌భ్యులు గాని ఇబ్బందులు పడ‌కుండా రూ.15 వేలు న‌గ‌దును అందించి ఆ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈమేర‌కు జీవో. 347 విడుద‌ల చేస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్త‌ర్వులిచ్చారు.

కోవిడ్‌తో మృతి చెందిన వివ‌రాలు క‌లెక్ట‌ర్‌కు పంపించాలి. రాష్ట్ర ఆరోగ్య‌శాఖ ద్వారా జిల్లా క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో ఈ నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌నున్నారు. ద‌హ‌న సంస్కారాల‌కు సంబంధిత ప్రాంతాలలో ఉండే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల సిబ్బంది ద్వారా స‌మాచారం తీసుకుని సంబంధిత మృతుల‌ ద‌హ‌న సంస్కారాల‌కు రూ.15 వేలు అందివ్వ‌నున్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • ప్రపంచం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైమ్ న్యూస్
  • ఆరోగ్యం
  • ఉద్యోగాలు
  • రాజకీయాలు
  • టెక్నాలజీ
  • వీడియోలు
  • Copyrights Reserved 2024
  • Developed by RaamSee Technologies